తెలంగాణా గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే

-

తెలంగాణాలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. రెండు వేల వరకు వెళ్ళిన కేసులు మొన్న వెయ్యి వరకు నమోదు కాగా నేడు 1200 పైగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1286 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 12 మంది నిన్న ఒక్క రోజే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 563 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 1066 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు.

coronavirus

ఇప్పటి వరకు 49 వేల 675 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో మొత్తం కరోనా కేసులు 68 వేల 946 గా ఉన్నాయి. యాక్తీవ్ కేసులు 18 వేల 708 గా ఉన్నాయి. ఇంకా 919 మంది ఫలితాలు రావాల్సి ఉంది తెలంగాణాలో రికవరీ రేటు 72 శాతంగా ఉంది. భారత్ లో 65.77 శాతంగా ఉంది. హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గాయి. రాష్ట్రంలో కరోనా టెస్ట్ లు గత 24 గంటల్లో 13 వేల మందికి చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version