11 రోజుల్లో అయోధ్య బాల రాముడిని ఎంత మంది దర్శించుకున్నారంటే?

-

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం లో బాల రాముడి రూపంలో కొలువుదీరిన శ్రీరాముని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బాలరాముడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిపోయింది. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నుంచి 11 రోజుల వ్యవధిలో దాదాపు 25 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఆలయ హుండీకి రూ.11 కోట్ల విరాళాలు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలరాముడి దర్శనానికి భక్తులను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాగా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరు అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news