టార్గెట్ న్యూ ఇయర్ : భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత

-

న్యూ ఇయర్ వేడుకలు టార్గెట్ గా నగరంలోకి వచ్చిన డ్రగ్స్ ని భారీ ఎత్తున పట్టి వేశారు పోలీసులు. సికింద్రాబాద్ పరిధిలో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎం డి ఎం ఏ, ఎల్ ఎస్ డి డ్రగ్స్ , తో పాటు హాసిష్ ఆయిల్, గంజాయిని పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుండి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ ఈ ముఠా  విక్రయాలు చేస్తున్నట్టు గుర్తించారు.

10 లక్షలకు విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు  10 గ్రాముల ఎం డి ఎం ఏ, 75 ఎల్ ఎస్ డి బోల్ట్స్, 63 ఎక్టీసి పిల్స్, వీటితో పాటు కేజీ హాష్ ఆయిల్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు  టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముంబై లో తక్కువ రేట్ కు డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ డబుల్ రేట్ లకు అమ్ముతోంది ఈ ముఠా. ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేసి తుకారాం గేట్ పోలీసులకు అప్పగించారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news