బద్వేలులో వైసీపీకి భారీ ఆధిక్యం…2019 రికార్డు బ్రేక్‌

-

అమరావతి : బద్వేలు నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ భారీ ఆధిక్యం దిశ గా ముందుకు వెళుతోంది. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని దాటి దూసుకెళ్తోన్నారు వైసీపీ పార్టీ అభ్యర్ధి డాక్టర్ సుధ. 2019 ఎన్నికల్లో 44, 734 ఓట్ల ఆధిక్యం తో గెలుపొందిన వైసీపీ పార్టీ… ఈ సారి ఆ రికార్డు ను ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో బ్రేక్‌ చేసింది.

ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఏడు రౌండ్లకే 60,785 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతోంది వైసీపీ పార్టీ. దీంతో ఇప్పటి వరకు ఇప్పటి వరకు పోలైన ఓట్ల లో 75% ఓట్లు వైసీపీ ఖాతా లోనే పడ్డాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌ నుంచి… ఏ డో రౌండ్‌ కౌంటింగ్‌ వరకు ఎక్కడా తగ్గడం లేదు వైసీపీ పార్టీ. దీంతో బద్వేలు నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే అవకాశాలను మెరుగు పరుచుకుంది. ఇక అటు హుజురాబాద్‌ నియోజక వర్గంలో… బీజేపీ అభ్యర్థి లీడ్‌ లోఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news