భార్య‌కు రెండో పెళ్లి చేయ‌నున్న భ‌ర్త‌..!

-

పెళ్లియ్యి ఏడేళ్ల పాటు భార్య‌తో కాపురం చేసి ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న్న భ‌ర్త ఇప్పుడు మ‌ళ్లీ త‌న భార్య‌కు రెండో పెళ్లి చేస్తున్నాడు. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌న్యాదానం సినిమా ఇప్పుడు మ‌ళ్లీ రిపీట్ అవుతోంది. అంతెందుకు హిందీలో 1999లో వ‌చ్చిన హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాలోనూ ఐశ్వ‌ర్య ప్రేమించిన స‌ల్మాన్‌ను కాద‌ని ఆమె తండ్రి అజ‌య్‌తో పెళ్లి చేస్తాడు. చివ‌ర‌కు అజ‌య్ స‌ల్మాన్‌కే త‌న భార్య‌ను ఇచ్చి పెళ్లి చేయాల‌నుకున్నా త‌న‌ను ప్రేమిస్తోన్న భ‌ర్త అజ‌య్‌తోనే ఐశ్వ‌ర్య ఉండిపోతుంది.

ఇక తెలుగులో వ‌చ్చిన క‌న్య‌దానం సినిమాలో కూడా శ్రీకాంత్‌-రచనలకు పెళ్లైతే, రచనను ప్రేమించిన ఉపేంద్రకు ఇచ్చి వివాహం చేస్తాడు శ్రీకాంత్‌. ఇక ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మహేష్‌తో..ఫ్యాషన్‌ డిజైనర్‌ సంగీతకి ఏడేళ్ల క్రితం వీరికి వివాహమైంది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే వీరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించారు.

ఇంత‌కు వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.. మ‌రి విడాకులు ఎందుకు ? అంటారా ? త‌న భార్య సంగీతను ఆమె ప్రేమించిన వ్య‌క్తితో వివాహం చేయాల‌ని మ‌హేష్ అనుకోవ‌డ‌మే. పెళ్లికి ముందు సంగీత ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆ ప్రేమ‌ను తండ్రి ఒప్పుకోకుండా మ‌హేష్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే సంగీత ప్రేమించిన వ్య‌క్తి ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోకుండా ఆమె మీద ప్రేమ‌తో అలాగే ఉండిపోయాడు.

ఈ క్ర‌మంలోనే ఆమె అత‌డినే పెళ్లి చేసుకుంటాన‌ని భ‌ర్త‌కు చెప్పింది. ముందు మ‌హేష్ భార్య ప్ర‌పోజ‌ల్‌కు షాక్ అయినా చివ‌ర‌కు భార్య సంతోషం కోసం ఒప్పుకున్నాడు. అయితే ఇద్దరు పిల్లల సంరక్షణను తనే చూసుకుంటానని చెప్పాడు. దీనికి భార్య సంగీత కూడా అంగీకరించింది. అయితే ఆమె పిల్ల‌లు ఎప్పుడు చూడాల‌నుకున్నా వ‌చ్చి చూడ‌వ‌చ్చని కూడా చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news