హుజూర్‌నగర్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యత‌ ఎంతంటే..

-

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యా హ్నం 12 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని అధికారులు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్‌ తరఫున పద్మావతి ఉత్తమ్‌రెడ్డి, బీజేపీ తరఫున రామారావు బరిలో ఉన్నారు. ఇప్పటికే పద్మావతి ఉత్తమ్‌రెడ్డి కౌంటింగ్‌ సెంటర్‌కు చేరుకున్నారు.

ఇక తొలి రౌండ్‌ పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి 2,467 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే మూడో రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి 6 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news