హైదరాబాద్ : ప్రియుడి మోజులో భార్య దారుణం..!

-

ప్రియుడి మోజులో ఓ భార్య భర్తను కిడ్నాప్ చేయించి మరీ విడాకుల పేపర్ల పై సంతకాలు చేయించుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 2012 లో షేక్ వాజిద్ తో అప్సియా బేగం కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా అప్సియా కు సోషల్ మీడియాలో ముషీరాబాద్ కు చెందిన ఆసిఫ్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమ గా మారిన తరవాత అప్సియా అతడితో కలిసి ఇంటి నుండి పోయింది.

కానీ భర్త పోలీసుల సహాయం తో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాడు. భర్త విడాకులు ఇవ్వకపోవడం తో అప్సియా ప్రియుడితో కలిసి కిడ్నాప్ చేయించి విడాకుల పత్రాలపై సంతకం చేయించుకుంది. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు అందడం తో ప్రియుడిని అప్సియా బేగం ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఆసిఫ్ కు ఇప్పటికే రెండు సార్లు వివాహం జరిగినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అతడికి పిల్లలు కూడా ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news