బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద దారుణం..!

-

బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద దారుణం చోటు చేసుకుంది. మూడు కుక్క పిల్లలను ప‌ట్టుకుని ఓ మైనర్ బాలుడు దారుణంగా చంపాడు. దాంతో నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు అత‌డికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయిన‌ప్ప‌టికీ ఆ బాలుడు త‌న పద్ధతి మార్చుకోకుండా పావురాలపై దాడి చేశాడు. దాంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ వాకర్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

స‌దరు బాలుడు పావుల‌రాల‌ను చంపుతున్న వీడియో కు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో జంతు ప్రేమికులు బాలుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆ బాలుడికి (12) ఏళ్ల వ‌య‌సు ఉండ‌గా అత‌డు పావురాలు పట్టి బే బి అర్ పార్కు వద్ద విక్ర‌యిస్తాడ‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా జంతువులను ప‌క్షుల‌ను చిత్ర హింస‌లు పెట్ట‌డం కూడా నేర‌మే..మూగ‌జీవాల‌కు సంబంధించిన చ‌ట్టాల ప్ర‌కారం కేసులు న‌మోదు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news