డ్రగ్స్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు కీలక స్మగ్లర్లు

-

డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు మరో ఇద్దరు స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముంబయికి చెందిన మోహిత్‌తో పాటు మన్యం కృష్ణకిశోర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మోహిత్.. పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మోహిత్‌పై గతంలో రాంగోపాల్‌పేట్ పీఎస్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గోవాకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ అడ్మిన్‌తో మోహిత్‌కు పరిచయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. మోహిత్ జాబితాలోని డ్రగ్స్‌ వినియోగదారుల సమాచారం సేకరిస్తున్నారు. అతడితో పాటు నార్కోటిక్ విభాగం పోలీసులు మరో వ్యక్తిని పట్టుకున్నారు.

మరోవైపు మన్యం కృష్ణకిశోర్ రెడ్డి కేఎంసీ ప్రై.లి. నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పబ్‌లలో స్నేహితులకు పార్టీలు నిర్వహిస్తున్న కిశోర్‌.. డ్రగ్స్‌ కోసం తరచూ గోవా వెళ్లివస్తున్నట్లు గుర్తించారు. ఇతడికి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్‌తో పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఓ వ్యక్తి ద్వారా కృష్ణకిశోర్‌కు డ్రగ్స్ చేరుతున్నట్లు వెల్లడించారు. ఆదివారం రోజున బంజారాహిల్స్‌లో కృష్ణకిశోర్‌ రెడ్డిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అతడి నుంచి 2గ్రాములు కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news