విశాఖలో హైపర్‌బాయ్స్‌ వీరంగం.. మారణాయుధాలతో..

-

విశాఖపట్నంలో హైపర్ బాయ్స్ కలకలం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి విశాఖ కంచరపాలెం ఊర్వశి కూడలి వద్ద మారణాయుధాలు, గంజాయితో సంచరించారు. వీరి గురించి తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఓ ఆటో వద్ద నిందితులు దుంప రామకృష్ణ, అలమూరి కార్తిక్‌, నీలాపు శ్యామలరావు, నౌగణ సురేశ్‌పాల్‌, కొండపర్తి ఆకాశ్‌, దుంప రమణ, సిగణపురి చందు, లెక్కల జనార్దన్‌ మారణాయుధాలు, ఆరు కిలోల గంజాయితో కనిపించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు.

నిందితులు ‘హైపర్‌ బాయ్స్‌’ పేరిట ఓ వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకుని సెటిల్‌మెంట్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వని సందర్భంలో బాధితులు ఎదురు తిరిగితే ఈ బృందం మోసగించిన వ్యక్తి తరఫున రంగంలోకి దిగుతుంది. మారణాయుధాలతో వారిని బెదిరించి సెటిల్‌మెంట్లు చేస్తుందని పోలీసులు వెల్లడించారు. అలాగే వడ్డీలకు ఇచ్చేవారు కొందరు తమకు అప్పులు వసూలు కాకపోతే ఈ బృందాన్ని సంప్రదిస్తారు. వీళ్లు రుణగ్రహీతలను బెదిరించి రావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తమే రాబడతారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ దాడులు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news