ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

-

టీ 20 ప్రపంచ కప్ 2022 షెడ్యూల్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రిలీజ్ చేసింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 వ తేదీ నుంచి… నవంబర్ 13వ తేదీ వరకు ప్రపంచ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రూప్ 2 సూపర్ 12 స్టేజ్ లో ఇండియా తలపడనుంది. గ్రూప్ 2 లో టీమిండియాతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్టు ఉన్నాయి. అక్టోబర్ 23 వ తేదీన దాయాది దేశమైన పాకిస్తాన్ తో టీమిండియా తొలి పోరు జరగనుంది.

నవంబర్ 9వ తేదీన తొలి సెమీఫైనల్ జరగనుండగా.. నవంబర్ 10వ తేదీన రెండవ సెమిస్ నిర్వహించనున్నారు. మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13వ తేదీన టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.అయితే టి20 ప్రపంచకప్ 2022 లోనూ… పాకిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. గత ఏడాది ప్రపంచకప్ లో లిస్ట్ ఏజ్ లోనే పాకిస్తాన్ పై చిత్తుగా ఓడిపోయింది. ఇక ఈ సారి పాకిస్థాన్ పై గెలవాలని టీమిండియా భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news