ధైర్యం ఉంటే బీజేపీ నేతలు సికింద్రాబాద్ కాల్పుల్లో మరణించిన రాకేష్ ఇంటికి రావాలి: జగ్గారెడ్డి

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాల్పులకు బాధ్యులు ఎవరు? అని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం చంపితే.. టిఆర్ఎస్ శవయాత్రల రాజకీయం చేస్తోందని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాకేష్ డెడ్ బాడీ మీద టీఆర్ఎస్ జెండా ఎందుకు కప్పారు? అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే సికింద్రాబాద్ పోలీస్ కాల్పుల్లో మరణించిన రాకేష్ ఇంటికి బీజేపీ నేతలు రావాలని సవాల్ విసిరారు.

 

అగ్నిపధ్ రద్దు అయ్యే వరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని ప్రకటించారు. కాగా అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలో పోలీసు కాల్పులకు బలైన దామోదర రాకేష్ కు భిన్న వర్గాలు శనివారం కన్నీటి వీడ్కోలు పలికాయి. ఎంజీఎం మార్చూరీ నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు జరిగిన శవయాత్ర ఉధృతంగా సాగింది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. పలుచోట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పోచమ్మ మైదాన్ సెంటర్లోని కేంద్రప్రభుత్వ బిఎస్ఎన్ఎల్ భవనంపైన టిఆర్ఎస్ శ్రేణులు చెప్పులు, రాళ్లు విసరడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news