దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే బాధ్యత నాది : రేవంత్ రెడ్డి

-

హైదరాబాద్ కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా అంబర్‌పేటలో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి అయిందన్నారు. గత కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్ కు ఓఆర్‌ఆర్‌, ఫార్మా పరిశ్రమలు వచ్చాయన్నారు రేవంత్ రెడ్డి. గతంలోనే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు తీసుకువచ్చామని,ఇకపై అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మరోసారి కిషన్ రెడ్డి ఎంపీ అయితే ఉపయోగం లేదని.. దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మోదీ గ్యారెంటీకి వారెంటీ అయిపోందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news