ఈయన లేకపోతే జబర్దస్త్ కి దిక్కెవరు..!!

-

జబర్దస్త్.. కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో లో నెంబర్ వన్ కామెడీ షో గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ షో ద్వారా ఎంతోమంది తమ జీవితాలకు ఒక దారిని చూపించుకున్నారు. అలనాటి అందాలతార సీనియర్ హీరోయిన్ అలాగే మంత్రి ఆర్ కే రోజా కూడా జబర్దస్త్ ద్వారానే తన ఆర్థిక పరిస్థితులను మెరుగు పరుచుకుంది. తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రోజా జబర్దస్త్ ద్వారా జడ్జిగా వ్యవహరించి మొన్నటి వరకు బాగానే వెనక్కి వేసుకుంది. జబర్దస్త్ లో కమెడియన్ లుగా సుడిగాలి సుదీర్, హైపర్ ఆది, రాంప్రసాద్, గెటప్ శీను లాంటి వాళ్ళు బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ప్రస్తుతం జబర్దస్త్ లో ఎన్నో టీం లు వచ్చి కామెడీని పండిస్తున్నప్పటికీ సుధీర్ టీం మాత్రం వేరే లెవెల్ అని చెప్పవచ్చు. సుధీర్ కోసమే జబర్దస్త్ చూసే అభిమానులు కూడా ఉన్నారు అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ లో మాత్రమే కాకుండా మరొక వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ తో పాటు పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఢీ నుంచి తప్పుకోవడంతో ఈ షో యొక్క టిఆర్పి రేటింగ్ కూడా పూర్తిగా పడిపోయింది. అందుకే ఈ షో నిర్వాహకులు త్వరలోనే మళ్లీ సుధీర్ ను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్ళిపోతున్నాడు అనే వార్తలు విపరీతంగా ప్రచారం అయ్యాయి .అయితే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచి వెళ్లాలని సుధీర్ కూడా అభిమానులకు మాట ఇచ్చారు..పరిస్థితులు చూస్తుంటే మళ్లీ సుదీర్ జబర్దస్త్ నుంచి వెళ్లి పోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజం కాకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే హైపర్ ఆది కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. సుధీర్ కూడా వెళ్ళిపోతే జబర్దస్త్ లో కామెడీ పండించే కమెడియన్ మరొకరు రారు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సుధీర్ కూడా తప్పుకుంటే జబర్దస్త్ షో కి టిఆర్పి రేటింగ్ పడిపోవడం ఖాయమని జోస్యం కూడా చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version