ఏడు శనివారాలు ఇలా చేస్తే కష్టాలు ఉండవు..!

-

ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా కూడా మీరు అనుకున్నవి జరగడం లేదా.. ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనులు ఆగిపోతున్నాయా అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఏడు శనివారాలు మీరు ఈ విధంగా చేశారంటే కష్టాలన్నీ కూడా పోతాయి ఆనందంగా జీవించొచ్చు. మరి ఇక ఏడు శనివారాలు ఏం చేయాలి అనే విషయాన్ని చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది.

 

బాధలు అన్నిటి నుండి కూడా దూరంగా ఉండొచ్చు. శనివారం నాడు ఏడుకొండలవాడిని పూజించడం వలన శని బాధలు దోషాలు వంటివన్నీ కూడా పోతాయి వెంకటేశ్వర స్వామికి శనివారం చాలా ఇష్టం. ఏడు శనివారాలు మీరు ఇలా చేస్తే బాధలు అన్నిటి నుండి కూడా బయటపడొచ్చు శనివారం నాడు తలస్నానం చేసి మీ ఇంట్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత స్వామివారిని అందంగా అలంకరించండి. బియ్యం పిండితో ప్రమిద చేయాలి దీని కోసం కొంచెం పాలు, బెల్లం ముక్క, అరటిపండు వేసి బియ్యం పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి.

దీంతో మీరు ప్రమిద చేసి ఏడు వత్తులు అందులో వేసి వెంకటేశ్వర స్వామి వారికి వెలిగించాలి అలానే శనివారం సూర్యోదయం ముందు నిద్ర లేచి తులసి కోట ముందు దీపాన్ని కూడా కచ్చితంగా పెట్టండి. వెంకటేశ్వర స్వామి వారికి ఏడు శనివారాలు మీరు చేసినప్పుడు దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ నెయ్యిని గాని ఉపయోగించండి కష్టాలు అన్నిటినుండి బయటపడొచ్చు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news