ఉత్తరప్రదేశ్ లో దారుణం.. 9 మంది హత్యలకు కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

సాధారణంగా ఒక వ్యక్తి ఒకర్నీ హత్య చేశాడంటేనే మనం భయపడుతుంటాం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి ఏకంగా తొమ్మిది మంది మహిళలను హత్య చేశాడు. కేవలం 13 నెలల కాలంలో సీరియల్ కిల్లర్ 9 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్లితే.. యూపీ సీరియల్ కిల్లర్ పేరు కుల్దీప్ కుమార్ గంగ్వార్ (38). బరేలీ ప్రాంతంలోని అటవీ ప్రాంతం పొలాల్లో ఒంటరిగా పని చేస్తున్న మహిళలే ఇతని టార్గెట్.

2023 జులై నుంచి 2024 జులై వరకు గ్రామాల్లో మహిళలను ఇతను చంపాడు. ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు వెళ్లి తన కామ వాంఛ తీర్చమని అడగడం.. అతనితో అక్రమ సంబంధానికి మహిళ ఒప్పుకోకుంటే తీవ్ర కోపంతో గొంతు నులిమి చంపేసేవాడు సీరియల్ కిల్లర్. మరోవైపు ఈ దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. తన తల్లి జీవించి ఉండగానే తన తండ్రి బాబురామ్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య కోరిక మేరకు మొదటి భార్యను కొట్టేవాడు. తన సవితి తల్లి పట్ల ద్వేషం కారణంగా వయస్సులో ఉన్న మహిళలను బలిపశువులను చేయడం ప్రారంభించాడు. 9 మంది హత్య చేసి తల్లి ప్రేమ కోసమే అని పోలీసుల ముందు చెప్పడంతో పోలీసులు ఆశ్యర్యపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news