ఏపీ : ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల

-

ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ – 2021 పరీక్ష ఫలితాలను మంత్రులు ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రం లోని నాలుగు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కోసం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని.. పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేక పోవటంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.

నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని 4400 సీట్లకు 71, 207 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని.. ఒక్కొక్క సీటుకు 80 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. పది రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేశామని.. త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐఐటీ స్థాయి విద్యను అందించటం కోసమే వైయస్సార్ హయాంలో ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారని.. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలకు త్వరలోనే సీఎం జగన్ శాశ్వత భవనాలకు శంఖుస్థాపన చేస్తారని వెల్లడించారు. గతంలో ట్రిపుల్ ఐటీ కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించడం వల్లే భవనాల నిర్మాణంలో జాప్యం జరిగిందని.. ఈ ఏడాది అడ్మిట్ అయ్యే విద్యార్థులకు ఒంగోలు క్యాంపస్ లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news