అంబానీ ఇంట ఇండిపెండెన్సెడే సంబరాలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా మనవడు…!

-

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నేడు యావత్ దేశం స్వాతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ మువ్వన్నెల జెండాను ఎగురవేసి, స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఈ సంబరాల్లో పాలు పంచుకున్నారు.

భార్య నీతూ అంబానీ, మనవడు పృద్వి అంబానీతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ముఖేష్ అంబానీ మనవడిని ఎత్తుకోగా.. ఆయన సతీమణి నీతా అంబానీ చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ” మా తుఝే సలాం” అంటూ జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ వేడుకల్లో ముఖేష్ అంబానీ మనవడు పృద్వి ఆకాష్ అంబానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news