జూన్ 1న ఇండియా కూటమి సమావేశం…. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

-

జూన్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్రనేతలు సమావేశమవ్వనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారని సమాచారం.పార్టీ నివేదికల ప్రకారం ఈ చర్చల్లో కాంగ్రెస్‌ అగ్రనేతలు, కూటమి నేతలు, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు పాల్గోనున్నారు. ఇండియా కూటమిలో భాగంగా ఆప్ గోవా, గుజరాత్, దిల్లీ, హర్యానాల్లో కాంగ్రెస్‌తో సీట్ల భాగస్వామ్యంపై ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో రెండుచోట్ల కాంగ్రెస్‌కు పోటీగా బరిలోకి దిగింది.

కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి గత ఏడాది జులైలో 28 మంది సభ్యులతో కూడిన ఇండియా కూటమి ఏర్పడింది. కాగా ఎన్డీఏ కూటమి కేంద్రంలో వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్‌ సొంతం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news