ఇండియా కరోనా అప్డేట్ : కొత్తగా 27,254 కేసులు

-

మన దేశం లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నాయి. ఇక ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు…ఇవాళ మాత్రం తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 27,254 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,32,64,175 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,74,269 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 219 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,42,874 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 37,687 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,24,47,032 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 74,38,37,643 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 53,38,945 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news