ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు

-

భారత్ లో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఒక రోజు కేసులు, మరణాలు బాగా తగ్గుతోంటే మళ్ళీ వెంటనే పెరుగుతున్నాయి. అయితే నిన్నటి కంటే కేసులు బాగా తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 38,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల మొత్తం 443 మంది మృతి చెందారు.

అలాగే గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45,333గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,31,692 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,46,952గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 88,47,600కి చేరింది. అలాగే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,37,139 కి చేరింది. అయితే రికవరీ రేటుతో పాటు దేశంలో నమోదవుతున్న కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువ కావడం ఊరటనిచ్చే అంశం అని చెప్పక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news