ఇండియాలో 11,850 కరోనా కేసులు, 555 మరణాలు : 274 రోజుల తర్వాత ఇదే మొదటిసారి !

-

ఇండియాలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,850 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,36,308 కు చేరింది. 274 రోజుల తర్వాత ఇంత తక్కువగా యాక్టివ్‌ కేసులు నమోదవడం ఇదే తొలిసారి.  ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.26 శాతంగా ఉంది.

ఇక దేశం లో తాజాగా 555 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,63, 245 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12, 403 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తం గా ఆ రికవరీ ల సంఖ్య 3,386,483 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1, 11, 40,48,134 మంది కి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటి వరకు భారత దేశ వ్యాప్తంగా ఏకంగా 62.23 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news