ఇండియాలో కొత్తగా 1096 కరోనా కేసులు, 81 మరణాలు నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ పూర్తిగా తగ్గుముఖం పట్టేసింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1096 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,28,131 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 13,013 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.77 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 81 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,21,345 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1447 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,93,773 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,84,66,86,260 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 12,75,495 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news