ఇండియాలో మొదలైన థర్డ్ వేవ్..నిన్న ఒక్కరోజే కొత్తగా 90, 928 కరోనా కేసులు

-

ఇండియాలో కరోనా కేసులు భీభత్సంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఇండియాలో లక్షకు చేరుకున్నాయి కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో దేశంలో 90,928 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,85,401 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.46 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 325 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,82,876 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,206 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,43,41,009 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 148.67 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇండియాలో ఒమిక్రాన్‌ కేసులు సంక్య క్రమంగా పెరుగుతోంది. ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 2630 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news