ఇండియాలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా : ఇవాళ 18,454 కేసులు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు నిలకడ లేకుండా పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి వరకు భారీగా తగ్గిన కరోనా కేసులు… ఈ రోజున 18 వేల మార్కును దాటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశంలో… 18,454 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,78,831 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98. 15 శాతంగా ఉంది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17 , 561 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3. 34, 95, 808 కోట్ల కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారి సంఖ్య 100 కోట్లకు చేరిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 59 .57 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేట్ 1.34 గా నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news