నేడు మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ భేటీ..!

-

నేడు ఉదయం 11:30 గంటలకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3:45 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది. మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వపథకాల అమలుతీరుపై మంత్రిత్వశాఖల వారీగా ప్రధాని మోడీ రివ్యూ చేయనున్నారు. అంతేకాకుండా ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

దేశంలో కరోనా పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా థర్డ్ వేవ్ వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి…లాక్ డౌన్ విధించాలా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news