విలియమ్సన్ “రికార్డు సెంచరీ” తప్ప న్యూజిలాండ్ చేసిందేమీ లేదు !

-

నిన్నటి నుండి బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 310 పరుగులకు ఆల్ అవుట్ కాగా, బదులుగా కివీస్ రెండవ రోజు ఆటలో ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు మాత్రమే చేయగలిగింది. సొంతగడ్డపై కివీస్ పై మంచి బౌలింగ్ తో ఒత్తిడి చేయడంలో బంగ్లా సక్సెస్ అయిందని చెప్పాలి. న్యూజిలాండ్ ఆటగాళ్లలో కెప్టెన్ విలియమ్సన్ ఒక్కడే సెంచరీ (104) చేసి ఆ మాత్రం స్కోర్ రావడంలో ఉపయోగపడ్డాడు. ఫిలిప్స్ (42) మరియు మిచెల్ (41) లు ఇతనికి కాస్త సహకారం అందించారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఒక్కడే నాలుగు వికెట్లు పడగొట్టి కివీస్ ను కట్టడి చేశాడు. మరి ఈ మ్యాచ్ లో కివీస్ పట్టు బిగించాలంటే మరో పరుగులు అయినా రేపు ఉదయం చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత బంగ్లాను 200 పరుగుల లోపే కట్టడి చెయ్యాలి. మరి కివీస్ ఈ మ్యాచ్ లో బంగ్లాను ఓడించి మొదటి టెస్ట్ లో విజయాన్ని అందుకుందా అన్నది చూడాలి. ఇక కెన్ విలియమ్సన్ వరుసగా మూడు టెస్ట్ ఇన్నింగ్స్ లలో సెంచరీ లు చేసి రికార్డు సాధించగా, మిగిలిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news