DO-OR-DIE:ఇండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్ … గెలిస్తేనే సిరీస్ ఆశలు !

-

ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్యన గయానా వేదికగా మూడవ టీ 20 జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఇండియా తప్పక గెలవాల్సి ఉండగా , టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. వెస్ట్ ఇండీస్ నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. వెస్ట్ ఇండీస్ ఇన్నింగ్స్ ను బ్రాండన్ కింగ్ 42 పరుగులతో మంచి ఓపెనింగ్ ఇవ్వగా, మేయర్స్ కూడా సరిగా ఆడినా ఆరంభాన్ని భారీ స్కోర్ గా మలచడంలో విఫలం అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ హీరో పూరన్ మెరుపులు తక్కువయ్యాయి. కెప్టెన్ పావెల్ ఒక్కడే నిదానంగా ఆడి జట్టుకు ఈ స్లో పిచ్ మీద కట్టడి చేయగలిగిన స్కోర్ ను సాధించి పెట్టాడు. ఇక ఇండియా బౌలర్లలో కేవలం రిస్ట్ స్పిన్నర్ గా ఉన్న కుల్దీప్ యాదవ్ ఒక్కడే నాలుగు ఓవర్ లలో 28 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.

ఇతని తర్వాత అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు. ఇక అర్ష్ దీప్ సింగ్ మరియు చాహల్ లు మరోసారి విఫలం అయ్యారు. మరి ఈ స్కోర్ ను ఇండియా ఛేదిస్తుందా ? లేదా అన్నది తెలియాలంటే మరికాసేపు ఆగాలి.

Read more RELATED
Recommended to you

Latest news