ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ మాత్రమే మా నాయకుడు… వైరల్ అవుతున్న పోచారం పాత వీడియో

-

తెలంగాణ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. 20 సంవత్సరాలు రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓపిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందని అన్నారు. మాకు వయసు అయిపోయిందని అన్నారు.

ఇదిలా ఉంటే… పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గతంలో ఆయన కేసీఆర్ గురించి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట్లా వైరల్ అవుతోంది. ఓ బహిరంగ సభలో ఆనాటి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. జన్మలో మిమ్మల్ని మరవం సార్.. ప్రాణం ఉన్నంత వరకు మీరే మా నాయకుడు సార్.. ఇంకొకరు లేరు సార్ అని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.47 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి నాయకుడిని చూడలేదని ఆ వీడియోలో ప్రశంసల వర్షం కురిపిస్తారు.అనేక మంది నాయకులను తాను చూశానని.. కానీ ఆ నాయకులు మాత్రం చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నారు. చాలా మంది మంత్రులను, సీఎంలను తాను చూశానని.. కానీ మనస్ఫూర్తిగా, సహృదయంతో.. చల్లని చూపుతో సహాయం చేసిన వ్యక్తిని మిమ్మల్నే చూస్తున్నా అని అన్నారు.అయితే పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత ఈ వీడియోను నెట్టింట్లా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news