భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు.. మెరిసిన శరత్​ కమల్​, సాత్విక్​ జోడీ

-

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు ఆఖరి రోజున స్వర్ణాల పంట పండుతోంది. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్​లో లక్ష్యసేన్​, మహిళల సింగిల్స్‌లో సింధు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా పురుషుల డబుల్స్‌ విభాగంలోనూ భారత్‌ మరో స్వర్ణం అందుకుంది.

సాత్విక్‌ – చిరాగ్‌ శెట్టి జోడీ.. సీన్‌-బెన్‌ ద్వయంపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. మరోవైపు, టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఆచంట శరత్‌ కమల్‌ స్వర్ణం సాధించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ మీద 11-13, 11-7, 11-2, 11-6, 11-8తో శరత్‌ విజయం సాధించాడు.

ఈ రోజు ఇప్పటివరకు పీవీ సింధు, లక్ష్య సేన్‌, సాత్విక్‌ – చిరాగ్‌ పసిడి పతకాలు సాధించారు. శరత్‌ తెచ్చిన పతకంతో ఈ రోజు స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది. భారత్‌ పతకాల సంఖ్య 60కి చేరగా, ఇందులో 22 స్వర్ణాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news