తుస్సుమనిపించిన బౌలర్లు: బంగ్లాదేశ్ చేతిలో ఇండియా ఘోర ఓటమి… !

-

కాసేపటి క్రితమే ముగిసిన ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మూడవ టీ 20 మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సేన ఓటమి పాలయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా మహిళలు బంగ్లా ముందు కష్టసాధ్యం అయిన లక్ష్యాన్ని ఉంచడంలో సమిష్టిగా ఫెయిల్ అయ్యారు. ఇండియా ఇచ్చిన 103 పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి కాస్త పరువును దక్కించుకున్నారు. అంతకు ముందు జరిగిన రెండు మ్యాచ్ లలోనూ బంగ్లా ఓడిపోయింది. కాస్త ఉపశమనంగా చివరి మ్యాచ్ లో గెలుపు ఆతిధ్య జట్టుకు సొంతం అయింది. ఈ మ్యాచ్ కూడా గత మ్యాచ్ లో లాగా నాటకీయ పరిణామాల మధ్యన ఇండియా విజయాన్ని అందకుంటుందని భావించిన ఇండియా అభిమానులకు నిరాశే మిగిలింది.

ముఖ్యంగా గత మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన దీప్తి శర్మ మరియు షఫాలీ వర్మలు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడమే మ్యాచ్ ఓటమికి కారణం అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news