పవన్ కళ్యాణ్: సొంత వాళ్లే నన్ను అనుమానించారు… !

-

ఆంధ్రప్రదేశ్ లో గత రెండు వారల నుండి జనసేన ఎక్కువగా వైసీపీ ని మరియు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇరకాటంలో పడేస్తూ ఉంది, ఇక వైసీపీ కూడా జనసేనకు ధీటుగా సమాధానాలు ఇస్తూ ముందుకు వెళుతోంది. కాగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విషయం గురించి తలుచుకుని బాధపడ్డాడు. ఈయన మాట్లాడుతూ.. అధికార వైసీపీ నాయకులు జనసేన పార్టీని టీడీపీకి బి టీం అని హేళన చేస్తుంటే, సొంత వాళ్ళే పార్టీని మరియు నన్ను సందేహించారని బాధపడ్డారు. ఈ విషయం నన్ను చాలా బాధ పెట్టిందని తెలియచేశారు పవన్ కళ్యాణ్. మన గురించి తెలియని బయట వాళ్ళు ఎమన్నా దాని గురించి పెద్దగా బాధ ఉండదు, కానీ మనతో ఉంటూ మన సిద్ధాంతాలు తెలిసి కూడా ఇలా అనడం చాలా బాధించిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఒత్తిళ్లు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి..

అంతమాత్రాన వాటికి లొంగిపోతే ఇక కమిట్మెంట్ కు అర్ధం ఏముంటుందంటూ సొంతవాళ్లనే మోటివేట్ చేసే మాటలను మాట్లాడారు పవన్. ఎవరికోసమో జనసేన పార్టీ సిద్ధాంతాలను మార్చుకోదు అంటూ బల్లగుద్ది చెప్పారు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news