IND VS BAN : సంచలనం విజయం సాధించిన ఇండియా మహిళలు.. !

-

ఇండియా మరియు బంగ్లాదేశ్ మహిళల మధ్యన టీ 20 సిరీస్ జరుగుతోంది, అందులో భాగంగా మొన్న జరిగిన మొదటి టీ 20 లో ఇండియా మహిళలు విజయాన్ని సాధించి మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఆధిక్యంలోకి వెళ్ళింది. కాగా ఈ రోజు జరిగిన రెండవ మ్యాచ్ లోనూ 8 పరుగుల తేడాతో గెలుచుకుని మ్యాచ్ ను మరియు సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాను బంగ్లాదేశ్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో కేవలం 95 పరుగులకే పరిమితం చేసింది. ఇండియాను బంగ్లా బౌలర్లు ఖతున్ లు ఇద్దరూ చెలరేగి అయిదు వికెట్లను తీసుకుని ఇండియాను చావు దెబ్బ తీశారు. అనంతరం 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా మహిళలను ఇండియా బౌలర్లు బెంబేలెత్తించారు. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 3, షఫాలీ వర్మ 3, మిన్ను మని రెండు వికెట్లు సాధించి ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించారు.

 

ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు… కానీ దీప్తి శర్మ మరియు షెఫాలీ వర్మ అద్భుతం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version