Tokyo Olympics: జపాన్ పై భారత హాకీ జట్టు విజయం

-

టోక్యో ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు తన దూకుడును కొనసాగిస్తునే ఉంది. ఇవాళ జపాన్ జట్టుతో.. ఇండియా హాకీ టీం తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో తనదైన ఆటతీరును ప్రదర్శించిన టీమిండియా… 5-2 తేడాతో ఘన విజయం సాధించింది.

అర్జెంటీనా టీం పై గెలుపుతో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్తును… ఖరారు చేసుకున్న ఇండియా హాకీ టీం… ఇవాళ అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఇక జపాన్ పై విజయంతో… ఆస్ట్రేలియా జట్టుతో రెండవ స్థానం కోసం పోటీపడి నుండి ఇండియా.

జపాన్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి క్వార్టర్ ప్రారంభంలోనే హర్మన్ ప్రీత్… అద్భుతమైన గోల్ చేసి టీమిండియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఇక ఈ తొలి గోల్ తో…. భారత ఆటగాళ్లు చివరి రౌండ్ వరకు రెచ్చిపోయారు. దీంతో ఇండియా హాకీ జట్టు జపాన్ పై 5-2 తేడాతో ఘన విజయం సాధించింది. ఇక అటు బ్యాడ్మింటన్ లో పీవీ సింధు.. సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news