ఢిల్లీ వన్డే మనదే.. వన్డే సిరీస్ కూడా మనదే..!

-

టీమిండియా మరో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ ను గెలిచిన భారత జట్టు, తాజాగా వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. ఇవాళ ఢిల్లీలో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికాను 99 పరుగులకే కట్టడి చేసిన భారత్… 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

శ్రేయాస్ అయ్యర్ సిక్స్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు. అంతకుముందు కెప్టెన్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసిన రనౌట్ కాగా, మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 49 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 10 పరుగులు చేసి ఫోర్టుయిన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ 28, సంజు శాంసన్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1తో చేజిక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version