సలార్ ముహూర్తం.. ఒకే ఫ్రేములో ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్..

-

ప్రభాస్.. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా అత్యధిక క్రేజ్ ఉన్న స్టార్. బాహుబలి సినిమాతో అతడి రేంజ్ మారిపోయింది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా అంతగా ఆడకపోయిన ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ క్రేజీగా ఉన్నాయి. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేషన్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఐతే ప్రస్తుతం సలార్ మూవీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ముహూర్త వేడుకకి కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా హాజరయ్యాడు.

కేజీఎఫ్ సినిమాతో చరిత్ర సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా ముహూర్తానికి యష్ హాజరవడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేములో కనిపించేసరికి దేశ వ్యాప్తంగా అభిమానుల సందడి కోలాహలంగా మారింది. హాంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ మొదలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news