ష‌ర్మిలకు బిగ్ షాక్‌.. ఆమ్ ఆద్మీపార్టీలో చేరిన ఇందిరా శోభ‌న్‌

-

మాజీ వైసీపీ తెలంగాణ పార్టీ నేత‌, వైఎస్ ష‌ర్మిల ఆత్మీయురాలు.. ఇందిరా శోభ‌న్ ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ‌.. ఆమె.. జాతీయ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో.. ఆమ్ ఆద్మీ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇందిరా శోభ‌న్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీత ఒక సామాన్యుల పార్టీ అని.. అందుకే తాను ఆపార్టీ లో చేరాల‌ని అనుకున్నాన‌ని చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీ లో చేర‌డం సంతోషంగా ఉంద‌ని వెల్ల‌డించారు ఇందిరా శోభ‌న్‌. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయ ముఖ చిత్రం మారిపోయింద‌న్నారు. ఒక సాధార‌ణ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని.. బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు ఒకే గొడుగు కింద ప‌ని చేస్తున్నాయ‌ని నిప్పులు చెరిగారు. కేంద్రంలో బ‌డా మోడీ, రాష్ట్రంలో చోట మోడీ అంటూ ఇందిరా శోభ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జాతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ తో పూర్తి స్వేచ్ఛ‌గా ప‌ని చేస్తాన‌ని చెప్పారు. పార్టీని తెలంగాణ‌లో అభివృద్ధి చేస్తాన‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news