నేరం అంగీకరించిన అమెరికా 9/11 దాడుల కీలక సూత్రధారి

-

అమెరికాలో 2001 సెప్టెంబరు 11న జంట భవనాలపై ముష్కరులు పాల్పడిన ఘటనలో 3వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక ఉగ్రవాది ఖలీద్ షేక్ మహ్మద్‌ తన నేరాన్ని ఒప్పుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ఖలీద్ షేక్ మహ్మద్ మరో ఇద్దరు సహచరులు వాలిద్ బిన్ అట్టాశ్, ముస్తఫా అల్-హవ్సావి కూడా నేరాంగీకారానికి ముందుకు వచ్చినట్లు అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌ వెల్లడించింది. ప్రస్తుతం వీరంతా క్యూబాలోని గ్వాంటనామో అమెరికా సైనిక జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

అయితే ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను మాత్రం పెంటగాన్‌ వెల్లడించలేదు. నిందితులు సుదీర్ఘకాలంగా మరణశిక్ష ముప్పును తప్పించాలని కోరుతున్నట్లు సమాచారం. దానికి సమ్మతిస్తేనే నేరాంగీకారానికి ముందుకు వస్తామని షరతు విధించినట్లు తెలిసింది. దీనికి అమెరికా అంగీకరించిన తర్వాతే తప్పును ఒప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే వారికి జీవితఖైదు పడే అవకాశం ఉన్నట్లు ఓ కీలక అధికారి ఒకరు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news