‘భయం గుప్పిట్లో కెనడా హిందువులు’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ విమర్శలు..!

-

కెనడా-భారత్​ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ అధికార పార్టీ ఎంపీ సొంత పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడానికి తమ పార్టీదే బాధ్యత అని కెనడా అధికార పార్టీ ఎంపీ చంద్ర ఆర్య అన్నారు. ఉగ్రవాదులు చేసిన బెదిరింపులతో కెనడా హిందువుల్లో భయం నెలకొందని తెలిపారు.

ప్రధానమంత్రి ట్రూడో ప్రకటన తర్వాత ఏం జరుగుతుందో..? తదుపరి పర్యవసానాలపై .. ఇక్కడి హిందూ కెనడియన్ల భద్రతపై ఆందోళన నెలకొందని ఆర్య అన్నారు. హిందూ కెనడియన్లు ఎంతో భయంతో ఉన్నారని.. సీబీసీ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హిందూ కెనడియన్లలో భయానికి మూడు కారణాలను విశ్లేషించారు.

1.ఖలిస్థాన్‌ ఉద్యమం అనేది హింస, హత్యలతో కూడుకున్నది. 38ఏళ్ల క్రితం జరిగిన ఎయిరిండియా బాంబు దాడి ఘటన చరిత్రలోనే అతిపెద్ద సామూహిక హత్యను కెనడియన్లు మరచిపోయారు.

2.ఇందిరా గాంధీ కట్‌ఔట్‌ను ఊరేగించిన విషయం. ఇటువంటి భావప్రకటనా స్వేచ్ఛను ఏదేశం అంగీకరిస్తుంది?

3.హిందూ కెనడియన్లు కెనడా వీడి పోవాలంటూ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం శోచనీయం

అయితే, కొందరు తీవ్రవాద భావజాలం ఉన్నవారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ.. ఎంతోమంది సిఖ్‌-కెనడియన్లు మాత్రం ఖలిస్థాన్‌ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదని… వారంతా హిందూ కెనడియన్లతోనే మమేకమయ్యారని అధికార పార్టీ ఎంపీ చంద్ర ఆర్య స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version