వైట్​హౌస్​లో డిన్నర్​కు పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్‌ దిగ్గజాలు

-

ప్రధాని నరేంద్ర మోదీకి వైట్​హౌస్​లో ఏర్పాటు చేసిన విందుకు పారిశ్రామిక వేత్తలు, బిలియనీర్లు, టెక్‌ దిగ్గజాలు, ఫ్యాషన్‌ ఐకాన్‌లు హాజరయ్యారు. అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ దాదాపు 400 మంది అతిథులను ఈ విందుకు ఆహ్వానించారు. వైట్​హౌస్​ దక్షిణాన ఉన్న లాన్‌లో ప్రత్యేకంగా పెవిలియన్‌ ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ ఈ విందు వద్దకు చేరుకున్నారు. విందు మెనూలో దాదాపు మొత్తం వెజిటేరియన్‌ వంటకాలే ఉన్నాయి.

ఈ డిన్నర్​లో భారత బిలియనీర్‌ ముఖేశ్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్రా, యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌, కార్పొరేట్‌ దిగ్గజం ఇంద్రానూయి, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ పాల్గొన్నారు. అతిథుల జాబితాలో మానవహక్కుల ఉద్యమకర్త మార్టిన్‌ లూథర్‌ కింగ్‌-3, టెన్నిస్‌ ఆటగాడు బిల్లీ జేన్‌ కింగ్‌, సినీ ప్రముఖుడు నైట్‌ శ్యామలన్‌, ఫ్యాషన్ డిజైనర్‌ రాల్ఫ్‌ లౌరెన్‌, వ్యాపారవేత్త ఫ్రాంక్‌ ఇస్లామ్‌, గ్రామీ అవార్డు గ్రహీత జాషువా బెల్‌, ఇండో-అమెరికన్‌ చట్టసభ సభ్యులు, రోఖన్నా, ప్రమీలా జయపాల్‌, బైడెన్‌ కుటుంబ సభ్యులు హంటర్‌, యాష్లే, జేమ్స్‌, నవోమీ బైడెన్‌ కూడా విందుకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news