వామ్మో … ఒక్క పోస్ట్ కు రూ. 7.5 కోట్లు సంపాదన …!

-

హాలీవుడ్ దిగ్గజ నటుడు డ్వేన్ జాన్సన్ ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న వ్యక్తిగా నిలిచాడు. తాజాగా సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ అయిన హాప్పర్ హెచ్ ‌క్యూ ప్రకటించిన వివరాల ప్రకారం 48 ఏళ్ల హాలీవుడ్ నటుడు ఏకంగా అడ్వటైజ్మెంట్ కోసం చేసే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తో ఏకంగా ఒక లక్షకు పైగా డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇది మన భారతదేశ కరెన్సీ లో 7 కోట్లకు సమానం. ఈ సంస్థ 2017 నుంచి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అత్యధిక పారితోషికం పొందిన వ్యక్తుల జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. ఇక ఇందులో తారలు ఒక్కో పోస్ట్ కి ఎంత సంపాదించుకున్నారు అంచనా వేస్తూ వారి సంపదను లెక్కించడం మొదలుపెట్టింది.

jhonson
jhonson

 

హాప్పర్ హెచ్ ‌క్యూ సంస్థ తెలిపిన లెక్కల ప్రకారం జాన్సన్ కు ఇన్స్టాగ్రామ్ లో 189 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో కైలీ జెన్నర్, ప్రో సాకర్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో, జెన్నర్ సోదరి కిమ్ కర్దాషియాన్, అరియానా గ్రాండే ఉన్నారు. ఇకపోతే డ్వేన్ జాన్సన్ కు ఈ సంవత్సరం ఎంతో కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈయన ఏకంగా ఫోర్బ్స్ – 2019 జారీచేసిన వివరాల ప్రకారం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం పొందుతున్న వ్యక్తి గా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news