ట్విటర్‌ కొత్త సీఈఓగా లిండా యాకరినో.. అసలు ఎవరీమె..?

-

ట్విటర్‌కు కొత్త సీఈఓ వస్తారని ఆ సంస్థ ప్రస్తుత సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటనతో నెక్స్ట్ సీఈవో ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ బాధ్యతల్ని ఓ మహిళ తీసుకోనున్నట్లు ప్రస్తుత సీఈఓ ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. ఆమె ఎవరనేది మాత్రం చెప్పలేదు. అయితే అమెరికా కార్పొరేట్‌ వర్గాలకు సుపరిచితమైన లిండా యాకరినో కొత్త సీఈఓ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ లిండా ఎవరు..?

లిండా ప్రస్తుతం ఎన్‌బీసీయూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె ట్విటర్‌ను ముందుకు నడిపే బాధ్యతలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఆమెతో మస్క్‌ గత కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. దాదాపు ఆమె పేరే సీఈఓగా ఖరారు కావొచ్చని ట్విటర్‌ వర్గాల్లో టాక్. యాకరినో గత నెల ఓ కార్యక్రమంలో మస్క్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు. వీరివురి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news