హమాస్‌ను ఉగ్రసంస్థగా భారత్‌ గుర్తించాలి : ఇజ్రాయెల్‌

-

హమాస్‌ను ఉగ్ర సంస్థగా గుర్తించాలని భారత్​ను ఇజ్రాయెల్ దేశం కోరింది. ఇందుకు సంబంధించి విస్తృత సమాచారాన్ని భారత్‌కు అందించే పనిలో నిమగ్నమయ్యామని.. భారత్ తప్పకుండా హమాస్​ను ఉగ్ర సంస్థగా గుర్తింస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే దీనిని 40 దేశాలు ఉగ్రసంస్థగా గుర్తించాయని వెల్లడించింది. భారత్‌-ఇజ్రాయెల్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో అనే విషయాన్ని తాజా సంక్షోభం రుజువు చేసిందని ఇజ్రాయెల్ చెబుతూనే.. గాజాకు మానవతా సహాయాన్ని అందించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

హమాస్‌కు సంబంధించిన సమాచారాన్నిచాలా క్రమపద్ధతిలో భారత్​తో పాటు ప్రపంచ దేశాలకు అందిస్తున్నామని భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి నవోర్‌ గిలాన్‌ తెలిపారు. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడాతోపాటు ఐరోపా సమాఖ్య దేశాలు వంటి 40 దేశాలు హమాస్‌ను ఇప్పటికే ఉగ్రసంస్థగా ప్రకటించాయని..  మిత్రదేశాలన్నీ అలానే గుర్తించాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య పోరు కొనసాగుతున్న వేళ.. తాజా పరిణామాలపై పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నవోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news