BREAKING : రేపు కొనాయపల్లికి సీఎం కేసీఆర్.. ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు

-

సిద్దిపేట జిల్లా కొనాయపల్లికి సీఎం కేసీఆర్ పయనం కానున్నారు. రేపు ఉదయం కొనాయపల్లికి సీఎం కేసీఆర్ వెళతారు. ఈ సందర్బంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 9న నామినేషన్‌ దాఖలు చేయనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్…ఒకే రోజు గజ్వెల్ , కామారెడ్డి లో నామినేషన్ వేస్తారు.

CM KCR to Konayapally tomorrow

ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర’ యాగం శాస్త్రోక్తంగా జరుగుతోంది. పండితులు పఠిస్తున్న వేద మంత్రోచ్ఛరణల మధ్య ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగుతోంది. ఈ యాగం నేటితో సంపూర్ణం కానుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ రెండు రోజుల క్రితం యాగాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటల 10 నిమిషాలకు పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news