మోదీ జీ.. నేను మీకు పెద్ద ఫ్యాన్.. వచ్చే ఏడాది ఇండియాకు వస్తాను : ఎలాన్ మస్క్

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం రోజున అమెరికా చేరుకున్న మోదీ.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్​తో మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్​లో పెట్టుబడులు పెట్టమని ఎలాన్ మస్క్​ను  ప్రధాని మోదీ కోరారు.

దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. తాను ప్రధాని మోదీ అభిమానినని అన్నారు​. మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన కొత్త కంపెనీలకు అండగా నిలుస్తారని మోదీపై మస్క్ ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఏడాది భారత్​లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నానని తెలిపారు.

“భారత్​లో పెట్టుబడులు పెట్టేవారిని ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారు. ట్విటర్‌ స్థానిక ప్రభుత్వాలు పెట్టే నిబంధనలు అనుసరించడం తప్ప వేరే మార్గం లేదు. లేదంటే సంస్థను మూసివేయాలి. ఏ దేశంలోనైనా ఆ దేశ చట్టాలకు అనుగుణంగానే ట్విట్టర్​ను నడపాలి. టెస్లా కంపెనీని భారత్​లో పెట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఆ దిశగా చర్యలు సాగిస్తాం. ప్రధాని మోదీకి భారత్​ పట్ల చాలా నిబద్ధత ఉంది. భారత్​లో పెట్టుబడులు పెట్టమని నన్ను ఆహ్వానించారు. ప్రధానితో చర్చలు అద్భుతంగా జరిగాయి”

– ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ

Read more RELATED
Recommended to you

Latest news