వాషింగ్టన్​కు మోదీ.. ప్రధానికి వైట్​హౌజ్ ఘనస్వాగతం.. బైడెన్​తో భేటీ

-

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వాషింగ్టన్​కు చేరుకున్నారు. మోదీకి వైట్​హౌస్​లో బైడెన్ దంపతులు ఘనస్వాగతం పలికారు. పురాతన అమెరికన్‌ బుక్‌ గ్యాలీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోదీకి బైడెన్‌ బహూకరించారు. అనంతరం ఇరువురూ భేటీ అయి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. వైట్​హౌస్​లో ప్రవేశించే ముందు బైడెన్​ దంపతులు, మోదీ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రధాని మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా కూడా వైట్​హౌస్​లోకి వెళ్లారు. అనంతరం బైడెన్ దంపతులు ఇచ్చిన విందులో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

అంతకుముందు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్​తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఆమెకు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా అమెరికా-భారత్​ బంధంపై జిల్ బైడెన్ మీడియాతో మాట్లాడారు. యూఎస్-భారత్​ భాగస్వామ్యం ప్రపంచ దేశాల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ప్రధాని మోదీ పర్యటనతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాలు ఒక చోటికి తీసుకొచ్చినట్లు ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news