సంక్రాంతికి అందుబాటులోకి అయోధ్య రామమందిరం

-

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిందని  ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. ఈ ఆలయం వచ్చే జనవరిలో సంక్రాంతికి భక్తులకు అందుబాటులోకి వస్తుందని.. సంక్రాంతి పర్వదినం (జనవరి 14) నుంచి జనవరి 24 వరకు అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పది రోజుల పాటు వైభవంగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 24న భక్తులకు ఆలయంలోకి అనుమతించనున్నట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠ ప్రక్రియను మకర సంక్రాంతికి ప్రారంభించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించిందని తెలిపారు.

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 14న ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పంచాంగంలో మంచి గడియలను చూసి ఈ తేదీని ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాముడి విగ్రహం ప్రతిష్ఠించేందుకు జ్యోతిషులు నాలుగు తేదీలను సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి 21, 22, 24, 25 తేదీలు రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమని తేల్చినట్లు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news