BREAKING NEWS : ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన రైలు.. ఆరుగురు దుర్మరణం

-

నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఓ ప్రయాణికుల బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది. అనంతరం బస్సును ట్రాక్‌ వెంట కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.

నైజీరియా దేశం లాగోస్‌ నగరంలోని ఐకెజా ఏరియాలోగల రైల్వే క్రాసింగ్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 90 మంది ఉన్నారు. ఈ ఘటను చూసిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి పరుగుపెట్టారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి బస్సులో చిక్కుకున్న 90 మంది ప్రయాణికులను బయటకు తీశారు.

క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version