ఇండియాలోని  ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన

-

భారత్‌లో పర్యటించే అమెరికా పౌరులకు ఆ దేశం కీలక సూచనలు చేసింది. ఇండియాలోని పలు ప్రాంతాల్లో పర్యటించొద్దని పేర్కొంది. ఆ ప్రాంతాలేంటి..? ఎందుకలా చెప్పిందంటే..?

భారత్ లోని మణిపుర్‌, జమ్మూ కశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్న దేశ మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని అమెరికా పౌరులకు ఆ దేశం సూచించింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణంపై పునరాలోచించాలంటూ రివైజ్డ్‌ ట్రావెల్‌ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా విడుదల చేసింది. భారత్ లో పెరుగుతోన్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తూర్పు లద్ధాఖ్‌ ప్రాంతం, లేహ్‌ మినహా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోనూ పర్యటించొద్దని కోరింది.

 

భారత్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు పర్యాటక ప్రాంతాలు, ఇతర చోట్ల అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు జరిగాయి. ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు/షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారు. కశ్మీర్‌లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్‌, గుల్‌మార్గ్‌, పహల్గామ్‌లలో చోటుచేసుకుంటాయి. అందువల్ల ఈ పర్యాటక ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత ప్రభుత్వం కూడా విదేశీ పర్యటకులను అనుమతించదు. అని అమెరికా తన ప్రకటనలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news