ఆ భారీ ఉగ్రదాడి చేసింది మేమే…!

-

విద్యార్థులతో సహా 22 మంది మృతి చెందిన కాబూల్ విశ్వవిద్యాలయంపై సోమవారం జరిగిన దాడికి ఇస్లామిక్ స్టేట్ జిహాదీ గ్రూపు బాధ్యత వహించినట్లు అమాక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ విశ్వవిద్యాలయంలో శిక్షణా కోర్సు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న సమావేశాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారని అమాక్ తన వార్తల్లో పేర్కొంది.

ఆఫ్ఘన్ అధికారులు విడుదల చేసిన మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది అని అంతకంటే ఎక్కువ మందే ప్రాణాలు కోల్పోయారు అని మీడియా అంటుంది. న్యాయమూర్తులు మరణాల గురించి ప్రస్తావించలేదు అని ఆరోపణలు వస్తున్నాయి. ముష్కరులు కాబూల్ విశ్వవిద్యాలయంపై దాడి చేసి… విద్యార్ధులను వారి క్లాసుల్లోనే విద్యార్ధులను చంపారు. అక్టోబర్ 24 న కాబూల్‌లోని ఒక విద్యా కేంద్రంలో టీనేజ్ విద్యార్థులతో సహా 24 మందిని ఆత్మాహుతి దాడిలో హతమార్చారు.

Read more RELATED
Recommended to you

Latest news